
టెక్ న్యూస్, ఈవార్తలు : ఈ మధ్య పలు ఆండ్రాయిడ్ ఫోన్లను అప్డేట్ చేయగానే స్క్రీన్పై గ్రీన్ లైన్ డిజైన్ చేయబడింది. ముఖ్యంగా వన్ ప్లస్ మొబైల్ వినియోగదారులకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. కొత్త ఫోన్ కొన్నా.. ఇలా ఎందుకు అయ్యిందో అనుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వన్ ప్లస్ సంస్థ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. జీవితకాలం పాటు ఉచితంగా స్క్రీన్ అప్ ఎంపికను అందిస్తోంది. వన్ ప్లస్ 8 ప్రో, వన్ ప్లస్ 8 టీ, వన్ ప్లస్ 9, 9ఆర్ వాడే మొబైల్ వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంటే.. వన్ ప్లస్ కంపెనీ సర్వీస్ సెంటర్కు వెళ్లి ఉచితంగా స్క్రీన్ను అప్ చేసుకోవచ్చు. క్లీనింగ్, మెయింటెనెన్స్ సేవలు కూడా పొందవచ్చు. వాస్తవానికి గత ఏడాది నుంచే వన్ ప్లస్ తన యూజర్లకు 10 ఆర్ మొబైల్స్పై కంపెనీ వోచర్ ఇస్తోంది. ఇప్పుడు సదుపాయాన్ని కల్పిస్తోంది.ఈ ఆఫర్ ఎలా పొందాలంటే.. వన్ ప్లస్ యాప్ ద్వారా రెడ్ కేబుల్ క్లబ్ మెంబర్షిప్ సెక్షన్కు వెళ్లి, బెనిఫిట్స్ దగ్గర లైఫ్టైమ్ ఫ్రీ స్క్రీన్ అప్ని పొందాలి. అందుకు ఫోన్ కొన్న ఒరిజినల్ బిల్లు దగ్గర ఉంచుకోవాలి. లేకపోతే ఆఫర్ రాదు. క్లెయిమ్ చేసుకున్నాక దగ్గరలోని సర్వీస్ సెంటర్కు స్క్రీన్ను అప్డేట్ చేసుకోవచ్చని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.