Home వార్తలుఖమ్మం తప్పుడు డాక్యుమెంట్లు, డబుల్ రిజిస్ట్రేషన్లతో మోసం చేస్తున్న ముఠా పై కేసు నమోదు : ఇన్స్‌పెక్టర్ భానుప్రకాశ్

తప్పుడు డాక్యుమెంట్లు, డబుల్ రిజిస్ట్రేషన్లతో మోసం చేస్తున్న ముఠా పై కేసు నమోదు : ఇన్స్‌పెక్టర్ భానుప్రకాశ్

by VRM Media
0 comments

ది. 02.03.2025 VRMMEDIA

తప్పుడు డాక్యుమెంట్లు, డబుల్ రిజిస్ట్రేషన్లతో మోసం చేస్తున్న ముఠా పై కేసు నమోదు : ఇన్స్‌పెక్టర్ భానుప్రకాశ్

భూములు లేకపోయినా తప్పుడు రిజిస్ట్రేషన్లు, డబుల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ద్వారా రుణాలు ఇప్పిస్తామంటూ అమాయకులను నమ్మించి మోసం చేస్తున్న ముఠా పై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం ఖానాపురం హవేలీ ఇన్స్‌పెక్టర్ భానుప్రకాశ్ తెలిపారు.

ఇటీవల నగరంలో భూమి క్రయవిక్రయాలు తగ్గడంతో అక్రమార్జనకు అలవాటు పడిన మాయగాళ్లు ఖరీదైన భూములకు డాక్యుమెంట్లు సృష్టిస్తూ.. తప్పుడు రిజిస్టర్ డాక్యుమెంట్లకు రుణాలు ఇప్పిస్తూ… రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న మధుర నగర్ ప్రాంతానికి చెందిన షేక్.బడే సాహెబ్, చింతకాని మండలం పాతర్లపాడు కు చెందిన కొత్తపల్లి వేంకటేశ్వర్లు తిప్పర్తి అశోక్ కుమార్ (RI రెవెన్యూ )పై కేసు నమోదు చేసి వీరి వద్ద నుంచి మరిన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకునట్లు తెలిపారు.
కొత్త రకం దందా వ్యవహారంలో మరింత లోతుగా విచారణ సాగుతుందని ఇన్స్‌పెక్టర్ తెలిపారు.

                    VRMMEDIA 
2,835 Views

You may also like

Leave a Comment