Home వార్తలుఖమ్మం ఏ.ఐ. ద్వారా విద్యార్థులకు సులభతరంగా విద్యా బోధన – జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఏ.ఐ. ద్వారా విద్యార్థులకు సులభతరంగా విద్యా బోధన – జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

by VRM Media
0 comments

ఏ.ఐ. ద్వారా విద్యార్థులకు సులభతరంగా విద్యా బోధన – జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

*5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు కనీస అభ్యాసన సామర్థ్యాల పెంపు లక్ష్యం

*ఖమ్మం జిల్లాలో 7 పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్టు క్రింద అమలు

53వ డివిజన్ ఎన్.ఎస్.పి. కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఏ.ఐ. తరగతి విద్యా బోధనను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం , మార్చి- 04:

సర్కారు బడిలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేథ)ను వినియోగిస్తూ విద్యార్థులకు సులభతరంగా విద్యా బోధన చేసేందుకు చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 53వ డివిజన్ ఎన్.ఎస్.పి. కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఏ.ఐ. విద్యా బోధనను పరిశీలించి, ఏ.ఐ. విద్యా బోధనకు అవలంబిస్తున్న పద్ధతులను తెలుసుకున్న కలెక్టర్ ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏ.ఐ.) ను వినియోగిస్తూ విద్యార్థులను ఆకట్టుకునేలా సులభ రీతిలో బోధన ప్రారంభించాలని అన్నారు. విద్యార్థులకు మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ దక్కేలా చూడాలని కలెక్టర్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పెంచేందుకు ఏ.ఐ. సహాయంతో నూతన బోధన పద్ధతులను ప్రవేశపెట్టిందని, మన ఖమ్మం జిల్లాలో 7 ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తుగా పైలెట్ ప్రాజెక్టు క్రింద ఏ.ఐ. విద్యా బోధనను ప్రారంభిస్తున్నామని, ఖమ్మం అర్బన్ ప్రాంతంలో నాలుగు పాఠశాలలు, నేలకొండపల్లి మండలం సింగిరెడ్డి పాలెంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, సత్తుపల్లి మండలంలోని సిద్ధారం, ఎన్టీఆర్ నగర్ లలో ప్రాథమిక పాఠశాలలో ఈ బోధన ఏర్పాటు చేశామని అన్నారు.

ఏ.ఐ. కోర్సు ప్రతి విద్యార్థికి ప్రత్యేకంగా ఉంటుందని, విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తూ దానికి అనుగుణంగా బోధన జరిగేలా ఏ.ఐ. కోర్సులు రూపొందించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి వరకు చదివే విద్యార్థులకు కనీస అభ్యాస సామర్థ్యాలు పెంచేలా ఏ.ఐ. ను వినియోగించడం జరుగుతుందని, పిల్లలు తెలుగు, ఆంగ్లం బాగా చదివి, రాసేలా, గణిత అంశాల్లో పట్టు సాధించేలా చూడడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అన్నారు.

ప్రభుత్వ ప్రాథమిక ఎన్.ఎస్.పి. పాఠశాలలో 3 నుండి 5వ తరగతిలో వెనకబడిన ప్రతి 10 మంది విద్యార్థులను ఎంపిక చేసి, ప్రస్తుతం తెలుగు, గణితంలో ఏ.ఐ. ద్వారా పాఠాలను బోదించడం జరుగుతుందని అకడమిక్ మానిటరింగ్ అధికారి రవి కుమార్ కలెక్టర్ కు వివరించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ పాఠశాలల్లో ఏఐ పాఠాలు నేర్చుకుంటున్న చిన్నారులతో ముచ్చటించారు. పిల్లలతో ఏ.ఐ. ద్వారా తెలుగు చదివించి వాటి అర్థం అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ అధికారి కె. రవి కుమార్, ఎం.ఈ.ఓ. శైలజా లక్ష్మీ, జి.సి.డి.ఓ. తులసి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బుర్రి వెంకన్న, ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీచేయనైనది.

ప్రచురణార్థం

ఏ.ఐ. ద్వారా విద్యార్థులకు సులభతరంగా విద్యా బోధన – జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

*5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు కనీస అభ్యాసన సామర్థ్యాల పెంపు లక్ష్యం

*ఖమ్మం జిల్లాలో 7 పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్టు క్రింద అమలు

53వ డివిజన్ ఎన్.ఎస్.పి. కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఏ.ఐ. తరగతి విద్యా బోధనను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం , మార్చి- 04:

సర్కారు బడిలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేథ)ను వినియోగిస్తూ విద్యార్థులకు సులభతరంగా విద్యా బోధన చేసేందుకు చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 53వ డివిజన్ ఎన్.ఎస్.పి. కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఏ.ఐ. విద్యా బోధనను పరిశీలించి, ఏ.ఐ. విద్యా బోధనకు అవలంబిస్తున్న పద్ధతులను తెలుసుకున్న కలెక్టర్ ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏ.ఐ.) ను వినియోగిస్తూ విద్యార్థులను ఆకట్టుకునేలా సులభ రీతిలో బోధన ప్రారంభించాలని అన్నారు. విద్యార్థులకు మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ దక్కేలా చూడాలని కలెక్టర్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పెంచేందుకు ఏ.ఐ. సహాయంతో నూతన బోధన పద్ధతులను ప్రవేశపెట్టిందని, మన ఖమ్మం జిల్లాలో 7 ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తుగా పైలెట్ ప్రాజెక్టు క్రింద ఏ.ఐ. విద్యా బోధనను ప్రారంభిస్తున్నామని, ఖమ్మం అర్బన్ ప్రాంతంలో నాలుగు పాఠశాలలు, నేలకొండపల్లి మండలం సింగిరెడ్డి పాలెంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, సత్తుపల్లి మండలంలోని సిద్ధారం, ఎన్టీఆర్ నగర్ లలో ప్రాథమిక పాఠశాలలో ఈ బోధన ఏర్పాటు చేశామని అన్నారు.

ఏ.ఐ. కోర్సు ప్రతి విద్యార్థికి ప్రత్యేకంగా ఉంటుందని, విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తూ దానికి అనుగుణంగా బోధన జరిగేలా ఏ.ఐ. కోర్సులు రూపొందించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి వరకు చదివే విద్యార్థులకు కనీస అభ్యాస సామర్థ్యాలు పెంచేలా ఏ.ఐ. ను వినియోగించడం జరుగుతుందని, పిల్లలు తెలుగు, ఆంగ్లం బాగా చదివి, రాసేలా, గణిత అంశాల్లో పట్టు సాధించేలా చూడడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అన్నారు.

ప్రభుత్వ ప్రాథమిక ఎన్.ఎస్.పి. పాఠశాలలో 3 నుండి 5వ తరగతిలో వెనకబడిన ప్రతి 10 మంది విద్యార్థులను ఎంపిక చేసి, ప్రస్తుతం తెలుగు, గణితంలో ఏ.ఐ. ద్వారా పాఠాలను బోదించడం జరుగుతుందని అకడమిక్ మానిటరింగ్ అధికారి రవి కుమార్ కలెక్టర్ కు వివరించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ పాఠశాలల్లో ఏఐ పాఠాలు నేర్చుకుంటున్న చిన్నారులతో ముచ్చటించారు. పిల్లలతో ఏ.ఐ. ద్వారా తెలుగు చదివించి వాటి అర్థం అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ అధికారి కె. రవి కుమార్, ఎం.ఈ.ఓ. శైలజా లక్ష్మీ, జి.సి.డి.ఓ. తులసి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బుర్రి వెంకన్న, ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు.

Vvrmmedia

2,825 Views

You may also like

Leave a Comment