తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అందించే అన్నప్రసాదంలో మరో కొత్త వంటకం వచ్చి చేరింది. స్వామివారి భక్తులకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ కేంద్రంలో నేటి (గురువారం) నుంచి అన్నప్రసాదంలో వడలు వడ్డించనున్నారు. ఉదయం 10.30 గంటలకు టీటీడీ ఛైర్మన్ చేతుల మీదుగా వాటిని భక్తులకు వడ్డించనున్నారు.