Home అంతర్జాతీయ భూమి పైకి రానున్న సునీత విలియమ్స్.. కీలక ప్రకటన చేసిన నాసా.! -VRM MEDIA

భూమి పైకి రానున్న సునీత విలియమ్స్.. కీలక ప్రకటన చేసిన నాసా.! -VRM MEDIA

by VRM Media
0 comments
భూమి పైకి రానున్న సునీత సునీత విలియమ్స్ .. కీలక ప్రకటన చేసిన నాసా.!


నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ కు సంబంధించిన కీలక ప్రకటనను నాసా చేసింది. అంతరిక్ష పర్యటనకు వెళ్లిన ఆమె సాంకేతిక ఇబ్బందుల కారణంగా తొమ్మిది నెలల నుంచి అంతరిక్షంలోనే ఉండిపోయారు. అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆమెను తీసుకెళ్లేందుకు నాసా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇంత సుదీర్ఘ కాలం పాటు అంతరిక్షంలో ఉండిపోయిన ఆమెను భూమి పైకి తీసుకువచ్చే ప్రక్రియ ప్రారంభమైనట్లు నాసా ప్రకటించారు. కొన్ని గంటల్లోనే సునీత విలియమ్స్ భూమిపైకి చేరుకోనన్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఐదు యాభై ఏడు గంటలకు భూమి మీదకు సునీత విలియమ్స్ చేరుకోనున్నారు. సునీత విలియ, విల్మోర్ ను తీసుకుని రాదశలోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూకక్షలోకి చేరుకుంది. క్రూ-10 మిషన్‌లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్షంలోకి ప్రవేశించారు. దీంతో సునీత విలియమ్స్ రాకకు మార్గం సుగమం అయింది. క్రూడ్ డ్రాగన్ వ్యోమనౌక తిరిగి ప్రయాణం సోమవారం రాత్రి 10:45 గంటలకు మొదలు. మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు ఫ్లోరిడా తీయడానికి చెరువులో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ దిగనుంది.

అందులో నుంచి ఒక్కొక్కరుగా వ్యోమగాములను బయటకు తీసుకు వస్తారని నాసా. సునీత విలియ, విల్మోర్‌తోపాటు మరో ఇద్దరు వ్యోమగాములు కూడా భూమి మీదకు రానున్నారు. సునీత విలియమ్స్ 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో సునీత విలియమ్స్, విల్మోర్ ఐఎస్ఎస్ కు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం వారం రోజులకే వీరిద్దరూ భూమిని తిరిగి చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే తిరిగి భూమికి వచ్చేసింది. అప్పటి నుంచి సునీత, విల్మోర్ లు ఐఎస్ఎస్ లోనే చిక్కుకుపోయారు. దీంతో సునీత విలియమ్స్ రాకపై సర్వత్ర ఆందోళన వ్యక్తం అయింది. ఒకానొక దశలో ఆమె ప్రాణాలతో బయటకు వచ్చే అవకాశం లేదన్న ప్రచారం జరిగింది. అయితే అక్కడ చిక్కుకుపోయిన వారి కోసం నాసా చర్యలను చేపడుతూనే ఉంది. ఆరోగ్యం చేయించకుండా ప్రత్యేక జాగ్రత్తలను చేపట్టారు. ఈ విధంగానే వారిని భూమి మీదకు తీసుకువచ్చే ప్రక్రియను ప్రారంభించింది. అందులో భాగంగానే క్రూ డ్రాగన్ రోదశలోకి వెళ్ళింది. నాసా ఈ ప్రోగ్రాం విజయవంతం కావడంతో మరికొద్ది గంటల్లోనే సునీత విలియమ్స్ భూమికి రానున్నారు.

మా అమ్మ బతికే ఉంది: సీఎం రమేశ్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,805 Views

You may also like

Leave a Comment