పాల్వంచలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల
పాల్వంచ పట్టణంలో బుధవారం జరిగిన పలు కార్యక్రమాల్లో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల పాల్గొన్నారు.
పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస కాలనీలో సువ్వారపు వెంకటేశ్వరరావు సతీమణి మృతి చెందగా కొత్వాల పాల్గొని సంతాపం తెలిపారు.
పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని కరకావాగు నివాసి భట్టు రాందాస్ కుమారుని దశదిన కర్మల్లో కొత్వాల పాల్గొని సంతాపం తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు పైడిపల్లి మహేష్, కందుకూరి రాము, రమణమూర్తి నాయుడు ( డిష్ నాయుడు), భట్టు మురళి, దారా చిరంజీవి, ఉండేటి శాంతి వర్ధన్, భట్టు వీరు, పులి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


