ది.25.04.2025
పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం …
నేలకొండపల్లి డిసిఎంఎస్ కేంద్రాన్ని, రైస్ మిల్లును సందర్శించిన పోలీస్ కమిషనర్
నేలకొండపల్లి మండలంలో గల జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డిసిఎంఎస్) కేంద్రాన్ని, రాజేశ్వరపురం లోని అరుణచల రైస్ మిల్లును శుక్రవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించారు. దాన్యం, కొనుగోలు, ట్రాన్స్పోర్ట్, కాంటాలు, బిల్లులు తదితర అంశాలపై రైతులతో మాట్లాడారు. మిల్లర్లతో మాట్లాడారు. రైతులకు ఏలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, మిల్లర్లకు, అధికారులకు సూచించారు. దాన్యం కొనుగోలు నుండి రైస్ మిల్లులకు తరలింపు వరకు కొనసాగుతున్న ప్రక్రియలో ఏలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంతంగా కొనసాగించాలని సూచించారు.
కార్యక్రమంలో సిఐ సంజీవ్, ఎస్సై సంతోష్ పాల్గొన్నారు.

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird