అన్నమయ్య జిల్లారాజంపేట నియోజకవర్గం పుల్లంపేట మండల కార్యవర్గం నియామకం
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి
పోతు గుంట రమేష్ నాయుడు
నేడు ఉల్లంపేటలోని శాంతినికేతన్ స్కూల్ నందు పుల్లంపేట మండల బిజెపి కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు మనోహర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్చార్జి పోతు గుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునే దిశలో మండల నూతన కార్యవర్గం వెనకోవడం జరిగిందని సందర్భంగా తెలియజేశారు పార్టీ సిద్ధాంతం పట్ల నిబద్ధతతో అందరూ పనిచేయాలని పార్టీ ప్రతి ఒక్కరి కోసం సబ్ కా సాత్ సబ్ కా వికాస్ కోసం పనిచేస్తుందని ప్రతి కార్యకర్త కూడా మొదట దేశం తర్వాత పార్టీ సెల్ఫ్ లాస్ట్ దీనికి ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని వారు తెలిపారు రాబోవు స్థానిక సంస్థ ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేయడానికి సంస్థాగతంగా బలంగా తయారు కావాలని ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం పుల్లంపేట మండల కార్యవర్గాన్ని నియమించడం జరిగింది. మండల అధ్యక్షులుగా మనోహర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శిగా కిరణ్ కుమార్ నూకల పరమేష్ ఉపాధ్యక్షులుగా చొప్ప రాజారెడ్డి విష్ణువర్ధన్ భరత్ వర్మ బుజ్జమ్మ కార్యదర్శులుగా రెడ్డయ్య మల్లికార్జున బాలాజీ రమణ కోశాధికారిగా గుజ్జల బాలాజీ ని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ గడ్డం శంకర్ రాజు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాసులు మాజీ మండల అధ్యక్షులు సుబ్బయ్య శంకర్రాజు పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird