43Vrm media satyanarayanaఅల్లూరి జిల్లా పెదబయలు మండలంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న పోలీసులు.
అల్లూరి జిల్లా పాడేరు :-
అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న పోలీసులు.
బుధవారం పెదబయలు మండల కేంద్రంలో పెదబయలు ఎస్సై కొల్లి రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఇన్నోవా కార్లో తరలిస్తున్న 400 కేజీల గంజాయిని సీజ్ చేశారు.
ఈ కేసులో ఇద్దరు ముద్దాయిలని ఒక ఇన్నోవా కారు 400 కేజీలు గంజాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీళ్ళు ఒరిస్సా రాష్ట్రం మల్కన్ గిరి జిల్లా ప్రాంతాల్లో కొనుగోలు చేసి మైదాన ప్రాంతాలకు తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని, దీని విలువ 20 లక్షలు ఉంటుందని, పెదబయలు ఎస్సై కొల్లి. రమణ తెలిపారు .