ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం మంత్రాలయం టీడీపీ ఇంచార్జి కోసిగిలో రాఘవేంద్ర రెడ్డి మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి బాధ్యతను గుర్తుచేశారు. మొక్కలు నాటడం మాత్రమే కాక వాటిని రక్షించడం ద్వారా భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించవచ్చు అని చెప్పారు. తమ పరిసరాల్లో ఎక్కువగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. మంత్రాలయం, కోసిగి టౌన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.