




పేదలకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వ పాలన…… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి
*అర్హులైన అందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
*ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించి పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రివర్యులు పొంగులేటి
ఖమ్మం, జూన్, 09:
పేదలకు అండగా ఇందిరమ్మ ప్రభుత్వ పాలన మన రాష్ట్రంలో కొనసాగుతుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
సోమవారం మంత్రి, ఏదులాపురం మున్సిపాలిటీ, ఖమ్మం రూరల్ మండలాల్లో పర్యటించి పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసారు.
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో 94 లక్షల అంచనా వ్యయంతో ఖమ్మం- సూర్యాపేట ఆర్ అండ్ బి రోడ్డు నుండి ఆటో నగర్- పొన్నేకల్ డొంక వరకు నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, రెండు పడకల గృహం అప్పగింత ధృవ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.
పోలేపల్లి గ్రామంలో పోలేపల్లి నుండి రాజీవ్ గృహకల్ప కాలనీ ఎన్.ఎస్. కెనాల్ లాక్స్ వరకు 2 కోట్ల 86 లక్షలతో నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.