సిద్ధవటంVRM న్యూస్ ప్రతినిధి జూన్ 14 గత 8 సంవత్సరాలుగా టక్కోలు ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న తిరుపతమ్మ గారు ట్రాన్స్ఫర్ కావడంతో, ఆమెకు నాగముని రెడ్డి గారి చేతుల మీదుగా ఘన సన్మానం అందించబడింది. ఈ సందర్భంలో నాగముని రెడ్డి గారు మాట్లాడుతూ, “విద్యను మానవత్వంతో మిళితం చేసిన టీచర్ ఆమె. తన సేవా ధర్మం ద్వారా టక్కోలు స్కూల్ను ఉత్తమ స్థాయికి తీసుకెళ్లారు. ఇటువంటి నిబద్ధత కలిగిన టీచర్లు నేటి సమాజానికి ఎంతో అవసరం” అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో శ్రీ లక్ష్మి గారు, చైర్మన్ నాగలక్ష్మి గారు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు