Home Uncategorized ఏజెన్సీ మారుమూల గ్రామాలకు (బిటి) తారు రోడ్లు వేయాలి. ఆదివాసీ జేఏసీ డిమాండ్.

ఏజెన్సీ మారుమూల గ్రామాలకు (బిటి) తారు రోడ్లు వేయాలి. ఆదివాసీ జేఏసీ డిమాండ్.

by VRM Media
0 comments

దేవీపట్నం, జూన్ 16.VRM MEDIA దుర్గా ప్రసాద్

ఏజెన్సీ మారుమూల గ్రామాలకు (బిటి) తారు రోడ్లు తక్షణమే వేయ్యాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారాముల జిల్లా ఏజెన్సీ మన్నెం ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు వెళ్లే రోడ్లన్నీ చిన్నపాటి వర్షానికే చెరువులా తలపిస్తున్నాయన్నారు.అలాగే వాగులు కాలువలు దాటేందుకు బ్రిడ్జిలు నిర్మించాలని డిమాండ్ చేశారు.కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏజెన్సీ మారుమూల గ్రామాలకు తారు రోడ్లు కాలువలకు బ్రిడ్జిలు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసి గ్రామాలకు అంబులెన్స్ వచ్చే విధంగా కృషి చేయాలన్నారు.అలాగే ఏజెన్సీ మన్నెం ప్రాంతంలోని విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

2,818 Views

You may also like

Leave a Comment