

కల్లూరు లో మినీ గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రఘునాథ్ బాబు మాట్లాడుతూ, యోగా వలన మానసిక ఒత్తిడి, మరియు శరీర దృఢత్వం, రోగ నిరోధక శక్తి, మనసు ప్రశాంతత వంటివి యోగ నుండి వస్తాయని తెలియజేశారు, మినీ గ్రీన్ ఫీల్డ్ స్టేడియం, బాస్కెట్బాల్ సింథటిక్ కోర్టు నందు ఈరోజు నిర్వహించుకొనుట జరిగినది వాకర్స్ అసోసియేషన్ సభ్యులు నిత్య యోగ సభ్యులు పాల్గొని విజయవంతం చేయడం జరిగినది కల్లూరు పరిసర ప్రాంతాల నుండి ఉన్నత పాఠశాలల విద్యార్థులు కల్లూరు గ్రామ పెద్దలు అందరూ 150 మంది పాల్గొనడం జరిగినది వచ్చిన వారి అందరికీ కూడాను సామూహికంగా ఆర్గానిక్ అరటిపండ్లు రాగిజావ అందించడం జరిగినది గ్రీన్ఫీల్డ్ మినీ స్టేడియం కల్లూరు వాకర్స్ అసోసియేషన్ కల్లూరు నిత్య యోగ సభ్యులు కల్లూరు. విద్యాశాఖ ఎంఈఓ నివేదిత, షుగర్ ఫ్యాక్టరీ సివిల్ ఇంజనీరు రఘునాథ్ బాబు, ప్రతిభా విద్యా సంస్థల అధినేత లక్కినేని ప్రసాద్, ఫిజికల్ ఉపాధ్యాయులు వీరరాఘవయ్య, రిటైర్ ఉద్యోగులు వ్యాపారస్తులు, మహిళలు పాల్గొన్నారు
Vmr న్యూస్ ప్రతినిధి శ్రీనివాసరాథోడ్