Home ఆంధ్రప్రదేశ్ తోటపల్లి గూడూరు మండలం కొత్తపాళెంలో శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవదేవేరులను దర్శించుకున్న సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డిun చంద్రమోహన్ రెడ్డి

తోటపల్లి గూడూరు మండలం కొత్తపాళెంలో శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవదేవేరులను దర్శించుకున్న సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డిun చంద్రమోహన్ రెడ్డి

by VRM Media
0 comments

Vrm Media నెల్లూరు ప్రతినిధి వెంకటేశ్వర్లు

సోమిరెడ్డికి ఆత్మీయ ఆహ్వానం పలికిన కొత్తపాళెం వాసులు

శ్రీ చెన్నకేశవస్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించిన సోమిరెడ్డి

మీడియాతో సోమిరెడ్డి కామెంట్స్

శ్రీ చెన్నకేశవస్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది

50 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయ పునర్నిర్మాణ పనులను టీటీడీ సహకారంతో చేపట్టేందుకు కృషి చేస్తాం

ఏ ఊరికి వెళ్లినా ఆడపడుచులు ఆనందంగా ఉన్నారు

తల్లికి వందనం నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి

ఎంత మంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం పథకం ద్వారా రూ.13 వేలు చొప్పున ప్రభుత్వం నిధులు జమ చేస్తోంది

ఏదేని కారణంతో లబ్ధి చేకూరని వారికి జూలై 5వ తేదీ నుంచి నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పథకాలు అందడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం

వచ్చే నెలలో అన్నదాత సుఖీభవ పథకం కూడా అమలు చేయబోతున్నాం

కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు కలిపి రూ.20 వేలు అందించబోతోంది

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం పథకం అమలుకానుంది

దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా సామాజిక పింఛన్ రూ.4 వేలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశే

బీహార్ లో ఇప్పటి వరకు పింఛన్ గా ఇస్తున్నది రూ.400 మాత్రమే. త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రూ400 నుంచి రూ.700కి పెంచినట్లు ఈ రోజు వార్తల్లో చూశాం

సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం కొత్త చరిత్ర సృష్జిస్తుంటే వైసీపీ, సాక్షి కడుపు మంటతో అల్లాడుతున్నాయి

ఎవరు ఏమనుకున్నా పెట్టుబడులు, పరిశ్రమలతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరగాలని, వృద్ధి రేటులో పెరుగుదల సాధించి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం

2,810 Views

You may also like

Leave a Comment