హైదరాబాద్ రాయదుర్గంలో భారీగా డ్రగ్స్ పట్టుకుంది యాంటీ నార్కొటిక్ బృందం. సుమారు రూ.30లక్షలు విలువ చేసే కొకైన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియా నుంచి భారత్ వచ్చిన ఓ వ్యక్తి పలు రేవ్ పార్టీలకు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన ఆరుగురు సెలబ్రెటీలను పోలీసులు గుర్తించారు. ఒక నైజీరియన్తో పాటు ఇద్దరు డ్రగ్స్ ప్లీడర్ను అదుపులోకి తీసుకున్నారు.