


సిద్ధవటంVRM న్యూస్ ప్రతినిధి జూన్ 24
సిద్ధవటం మండలం పొన్నవోలు కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని వెంకటాయపల్లి గ్రామంలో ప్రపంచ మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు జరపడం జరిగినది ఈ కార్యక్రమంలో పొన్నవోలు కొత్తపల్లి వైద్యాధికారులు డాక్టర్ J ప్రవీణ్ కుమార్ మరియు పి రంగలక్ష్మి మరియు సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు అక్కడి గ్రామ ప్రజలకు మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా బోదకాలు మరియు మెదడువాపు జ్వరాల గురించి గ్రామ ప్రజలకు వివరించడం జరిగినది ఈ జ్వరాలు దోమలు కుట్టడం వలన వస్తాయని పగటిపూట దోమలు కుట్టడం వలన డెంగ్యూ జ్వరం రాత్రిపూట దోమలు కుట్టడం వలన మలేరియా జ్వరం వస్తుందని కనుక మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మన ఇండ్ల చుట్టూ మరియు పరిసరాల చుట్టూ నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని ప్రతి ఒక్కరూ రాత్రిపూట ఉంటాయని గ్రామ ప్రజలకు వివరించారు ఇందులో భాగంగా ప్రతి ఇంటికి జ్వరాల గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది సిహెచ్ఓ లక్ష్మీనరసమ సూపర్వైజర్స్ లక్ష్మీదేవి మౌలాలి ఏఎన్ఎం షబానా MLHP వెంకటమ్మ ఆశ వర్కర్ కల్పన గ్రామ ప్రజలు పాల్గొన్నారు