లక్కిరెడ్డిపల్లి మండలంలో టీడీపీ బూత్ లెవెల్, గ్రామ లెవెల్ కమిటీలను మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి 60 కుటుంబాలకు ఇద్దరు ప్రతినిధులను నియమించాలని పార్టీ ముఖ్య ఉద్దేశ్యం అని అందుకోసం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లక్కిరెడ్డిపల్లి మండల అబ్సర్వర్ మరియు పార్లమెంట్ కార్యదర్శి శ్రీ నాగముని రెడ్డి గారు, మండల ఇంచార్జ్ వై మదన్ గారు కలిసి కమిటీలను పరిశీలించారు ఈ సమావేశంలో మండలంలోని టీడీపీ ముఖ్య కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి ఈ కమిటీల పునఃవ్యవస్థీకరణ కీలకమని నాయకులు అభిప్రాయపడ్డారు.