2014, 2018, 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థిగా మొదట ప్రతిపాదించిన పేరు మొహమ్మద్ జావేద్.
2014లో పువ్వడ అజయ్ కుమార్ పార్టీలో చేరడం..
2018లో పొత్తు ధర్మంలో భాగంగా సీటును టీడీపీకి కేటాయించడం..
2023లో ప్రకటన తరువాయి అనుకున్న తరుణంలో సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వర రావు పార్టీలో చేరడంతో మహమ్మద్ జావేద్ కు రాని అవకాశం.
మూడుమార్లు టికెట్ వస్తుందని ఆశించి.. బంగపడినా.. పార్టీ కోసం పని చేసిన నాయకుడు.
ఖమ్మం నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం, అన్ని బూతుల్లోనూ క్రియాశీలక కార్యకర్తలను తయారు చేయడం జావేద్ సాధించిన ఘనతగా అని చెప్పుకోవాలి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో 1,35 వేలకు పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు.
అనర్గళంగా తెలుగులో మాట్లాడగలడం, కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలకు నాయకులకు జావేద్ పై అభిమానం, 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమించిన జావేద్ కు అవకాశం ఇవ్వాలని కార్యకర్తల కోరుకోవడం మహమ్మద్ జావేద్ కు సానుకూలంగా మారే అవకాశాలు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం పేరుకే హై క్లాస్.. ఇక్కడ మెజారిటీ ఓటర్లంతా బీసీ ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలే అధికం.
ఖమ్మం జిల్లా వాసి కావడం కాంగ్రెస్ పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవం సీమఆంధ్రులు కూడా మన వాడే అనుకునే అవకాశం బలంగా ఉండడం జావేద్ గెలుపుకు రాచమార్గమేసే అంశాలు.
జూబ్లీహిల్స్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మహమ్మద్ జావేద్ నాన్ లోకల్ అని చేస్తున్న ప్రచారాన్ని పసలేని ప్రచారంగా చెప్పుకోవాలి.
తెలంగాణ మట్టి వాసన నేలతల్లి గుబాలింపు ఆకలింపు చేసుకున్న మహమ్మద్ జావేద్ నికార్సైన తెలంగాణ బిడ్డ.
కెసిఆర్ కేటీఆర్ వారికి రాని నాన్ లోకల్ సమస్య మహమ్మద్ జావేద్ కి ఎందుకు వస్తుంది??
ఖమ్మంలో పార్టీ నిర్మాణం కోసం క్షేత్రస్థాయిలో శ్రమించిన మహమ్మద్ జావేద్.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని అన్ని బూతుల్లో కూడా అంతకంటే ఎక్కువగా శ్రమించే అవకాశం ఉంది.
ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో లోని బస్తీలలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన ప్రజలే అధికం.
వారికేం ఇవ్వాలో వారి అవసరాలు ఏంటో క్షుణ్ణంగా తెలిసిన మహమ్మద్ జావేద్ ఇక్కడ ప్రజలను ఓటర్లను ఆకట్టుకుని కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం సాధించే పెడతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird