
VRM MEDIA ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్

నారాయణవరపు శ్రీనివాస్ జాతీయ బీసీ సంక్షేమం సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు*
కాల్లూరు మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో పటిష్ఠమైన బీసీ కమటీలను ఏర్పాటు చేయాలనీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ తెలిపారు
ఆదివారం నాడు కల్లూరు పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు బయ్యారపు నరేందర్ నివాసంలో మండల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించరు ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగీంచారు
ఈ సమావేశాన్ని ఉద్దేశించి శ్రీనివాస్ మాట్లాడుతూ గతఅసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు బీసీ ల జపమే చేశాయని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీసిలకు అన్ని రంగాలలో 42%రిజర్వేషన్ అమలు చేయాలని పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతువుంటే ఈ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ మీనహ ఒక్క రాజకీయ పార్టీ కూడా నోరు విప్పక పోవటం శోచనీయం అని శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఇస్తాను అన్న పార్టీ తీర్మానం చేసి చేతులు దులుపుకుంటే ఇవ్వాల్సినటువంటి బీజేపీ పార్టీ నిశ్శబ్దం గా చూస్తూ ఉందని నిజంగా బీజేపీ పార్టీ నాయకులకి దమ్ము ధైర్యం ఉంటే తీర్మానం చేసిన పార్టీ పై అవక్కులు చావక్కులు పేలాటం కాకుండా కేంద్రం పై వత్తిడి తెచ్చి బిల్లు ని అమోదించే విధంగా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ రాష్టంలో బీజేపీ, బి ఆర్ ఎస్ మేక తోలు కప్పుకున్న తోడేలు ల వ్యవరస్తున్నాయి అని శ్రీనివాస్ మండిపడ్డారు
బీసీలలో సామూహిక తిరుగుబాటు వచ్చిన నాడు మాత్రమే రాజ్యాంగం బద్ధమైన హక్కులు సాధించబడతాయాని ఆ నాటి తెలంగాణ రైతంగా సాయద పోరాటం అయిన మొన్నటి తెలంగాణ స్వరాష్ట్ర సాధన అయిన ప్రజలు తిరుగుబాటు తోనే సాధ్యం అయిందని కాబట్టి బీసీ సమాజం ఐక్యం గా తిరుగుబాటు చేసిన నాడు మాత్రమే భావి తరాల పిల్లల భవిష్యత్తు బావుంటుందని ఆయన తెలిపారు
జులై 10నాటికీ కల్లూరు మండలం లోని అన్ని గ్రామాలలో కమిటిలను పూర్తి చేసుకోవాలి అన్ని ఆయన సూచించారు
జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగనబోయిన పుల్లారావు మాట్లాడుతూ సంఘ నిర్మాణం భవిష్యత్ కార్యాచరణ గురించి సూచించారుఈ కార్యక్రమం లో
ఆళ్లకుంట నరసింహారావు, బొడ్డు కృష్ణ, ఎనుమల రాము, మేడేపల్లి వెంకటాచారి, రామ నరసింహారావు,బాలకృష్ణ,భరత్, రామకృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు