

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం ప్రతి ఒక్కరం మొక్కలను నాటుదాం భూతాపాన్ని తగ్గించుకుందాం.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముక్కలు నాటిన బిజెపి నాయకులు
పోతు గుంట రమేష్ నాయుడు
రాజంపేటలోని రాంనగర్ లో జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మొక్కల నాటడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇంచార్జ్ పోతు గుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యం పాటించాలని వారన్నారు ప్రతి ఒక్కరం మొక్కలను నాటుదాం.
భూతాపాన్ని తగ్గించుకుందాం.
పుడమి తల్లిని కాపాడుకుందాం.
ఆకుపచ్చని ఆంధ్రప్రదేశ్ ను నిర్మించుకుందాం.స్వచ్ఛమైన పర్యావరణం మనకు మంచి జీవితం ఇవ్వడంతో పాటు ,పిల్లల భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉంటుందనీ ఉన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధులు పట్టుపోగుల ఆదినారాయణ పట్టణ అధ్యక్షులు వివి రమణ పట్టణ ఉపాధ్యక్షులు పి మహేష్ స్థానిక నాయకులు నాగేంద్ర సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు