పర్యావరణ దినోత్సవం సందర్భంగా టక్కోలు గ్రామంలో చెట్లు నాటే కార్యక్రమం
సిద్ధవటం VRM ప్రతినిధి జూన్ 5 టక్కోలు గ్రామం, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని టక్కోలు గ్రామంలో “చెత్త నుండి సంపద తయారీ కేంద్రం” వద్ద ప్రత్యేక చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టబడింది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి ఆధ్వర్యం వహించగా, స్పెషల్ ఆఫీసర్ జయసింహా, ఎంపీడీఓ ఫణి రాజా కుమారి, APO నరసింహులు, పంచాయతీ కార్యదర్శి శివయ్య తదితరులు పాల్గొన్నారు.