ఇటీవల న్యాయ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి .రాజగోపాల్ ను శుక్రవారం ఖమ్మం బార్ అసోసియేషన్ న్యాయవాదులు, ఖమ్మం న్యాయవాద సొసైటీ డైరెక్టర్లు విరామ సమయంలో తన చాంబర్లో కలిసి పూల మొక్క బహుకరించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జమ్ముల శరత్ కుమార్ రెడ్డి, కాసర రాజశేఖర్ రెడ్డి,బత్తుల బసవ పున్నయ్య, రావూరి నరసింహారావు,ఆకుల శేఖర్, హేమంత్, వెంకట్ నారాయణ గౌడ్ ,జాలావతి, ఆవుల అనురాధ, మోసెస్ క్రిస్టఫర్ తో పాటు పలువురు న్యాయవాదులు సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు