Home ఆంధ్రప్రదేశ్ Vrm media ప్రతినిధి భద్రం రంపచోడవరం..

Vrm media ప్రతినిధి భద్రం రంపచోడవరం..

by VRM Media
0 comments

దేవీపట్నం మండలం రంపచోడవరం నియోజకవర్గ దేవీపట్నం మండలం ఇందుకూరు పంచాయితీ ఫజుల్లాబాద్ గ్రామంలో శాసనసభ్యులు గౌరవ శ్రీ ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీష దేవిగారు ఇంటి ఇంటికి సుపరి పాలన తొలి అడుగు కార్యక్రమం లో పాల్గొలి ప్రతి గడపకు వెళ్లి గ్రామస్థులతో మాట్లాడి కూటమి పాలనకోసం చర్చించి గ్రామస్తుల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు ఆరోగ్య పరిస్థితి బాగాలేని వారి కుటుంబానికి నేనున్నా అంటూ భరోసా ఇస్తూ వారిని ఆప్యాయం గా పలకరిస్తూ గ్రామస్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ సీసీ రోడ్లు లేని వీదుల్లో తిరుగుతూ గత ప్రభుత్వం లో ఎంత అభివృద్ధి జరిగిందో గ్రామస్థుల మాటల్లో తెలుసుకున్నారు… ప్రతి సమస్యను పి.ఎ విక్టర్ గారి ద్వారా అర్జీలు పర్సనల్గా డైరీలో నోట్ చేయించటం జరిగింది త్వరలోనే మీ సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని తెలియచేసారు.కూటమి ప్రభుత్వం లో ఈ సంవత్సర కాలం నుంచు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు రానున్న రోజుల్లో చేయబోయే కార్యాచరణ వివరిస్తూ ఎంతో అంగరంగా వైభవంగా సుపరి పాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది.అలానే జూనియర్ కళాశాల యాజమాన్యం కళాశాలకు సంబందించిన అర్జీని గౌరవ ఎమ్మెల్యే శిరీష దేవి గారికి ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమం లో రంపచోడవరం అబ్జార్వ్ గా నియమితులు అయినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు పాల్గొనగా దేవీపట్నం మండలం టీడీపీ జిల్లా మండలం నాయకులు,మాజీ మండల అధ్యక్షులు, ఎంపీటీసీ లు,జడ్పీటీసీలు,సర్పంచులు వివిధ నామినేటడ్ చైర్మన్స్ నెంబర్స్,గ్రామ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొనగా జనసేనపార్టీ మండల అధ్యక్షులు చారపు వెంకటరాయుడు ప్రధాన కార్యదర్శి కొమరం దొరబాబు, ఎస్టీ సెల్ అధ్యక్షులు కుంజం శ్రీనివాస్ దొర, మండల సీనియర్ నాయకులు ఐనవిల్లి భద్రం,పెండేటి నర్సింమూర్తి,కొత్తపల్లి సతీష్, తాళ్లూరి పవన్ కుమార్ రెడ్డి,ఈక నాగన్న దొర,పండు దొర, గొందురు గ్రామ అధ్యక్షులు తాటి రాజు,తుర్రం ధర్మజు,సోదే రవి,కాలుం మహేష్,మీడియా కోఆర్డినేటర్ కారం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు…✍️✊🙏

2,850 Views

You may also like

Leave a Comment