
సూపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని ఘనవిజయం వైపు నడిపిస్తున్న రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రాజు
సిద్ధవటం VRM న్యూస్ ప్రతినిధి జూలై 29g
సిద్ధవటం మండలం రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి కృతజ్ఞతలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, నారా లోకేష్ చొరవతో రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో రాజంపేట నియోజకవర్గం లో ‘సూపరిపాలనకు తొలి అడుగు’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగిస్తున్న కార్యకర్తలకు ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి, కూటమి ప్రభుత్వం గత ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు విపులంగా వివరిస్తు.పౌరుల సమస్యలను నేరుగా గుర్తించి, వాటిని సంబంధిత నాయకులు మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగా కార్యకర్తలు నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ప్రతియొక్క కార్యకర్తదీ కీలక పాత్ర.వారి సేవలపట్ల హృదయపూర్వక కృతజ్ఞతలు.
రాజంపేట పార్లమెంట్ కార్యదర్శి శ్రీ నాగముని రెడ్డి
