
కల్లూరు మునిసిపాలిటీ కార్మికులకు దుస్తులు పంపిణీ
VRM న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్

పాఠశాలలో విద్యార్థులకు మంచినీటి సౌకర్యార్థంకై రూ 20 వేల విలువగల మినరల్ వాటర్ కూలర్ ను వితరణ చేశారు
రూ..1. 50 లక్షల విలువగల దుస్తులు, వాటర్ కూలర్ వితరణ
జె ఎస్ ఆర్ ట్రస్ట్ అధినేత. జాస్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో
మున్సిపాలిటీ కార్మికులకు సిబ్బందికి విలువైన దుస్తులు పంపిణీ చేశారు..
కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎన్ఎస్పి క్యాంపు సమీపానగల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం రూ.20 వేల విలువ గల మంచినీటి సౌకర్యార్థం కూలింగ్ వాటర్ ప్లాంట్ ను అందజేశారు.
ఇంకనూ అంబేద్కర్ నగర్ వృద్ధులకు పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. కప్పల బంధం గ్రామంలో 70 మంది మహిళలకు దుస్తులు కూడా పంపిణీ చేశారు
విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
జె ఎస్ ఆర్ ట్రస్ట్ అధినేత పలు రకాలుగా అందిస్తున్న సేవలు గాను మున్సిపాలిటీ కార్మికులు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు
ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు కాకర్ల రంగారావు, మాజీ ఎంపీటీసీ పోట్రు శ్రీనివాసరావు. తదితరులు పాల్గొన్నారు