Home వార్తలుఖమ్మం కుక్కా యాలాద్రి ని పరామర్శించిన మంత్రి పొంగులేటి

కుక్కా యాలాద్రి ని పరామర్శించిన మంత్రి పొంగులేటి

by VRM Media
0 comments

కల్లూరు జులై27 vrm media ప్రతినిధి శ్రీనివాస రాథోడ్ న్యూస్):

మండల పరిధి చండ్రుపట్ల గ్రామ సీనియర్ నాయకులు కుక్కా యాలాద్రి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం చుండ్రు పట్ల గ్రామంలో యాలాద్రి నివాస గృహంలోవెళ్లి పరామర్శించి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మీరు భయపడొద్దు మీకు నేను అండగా ఉంటా అంటూ, అధైర్య పడకండి అని మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి, భాగం ప్రభాకర్ చౌదరి, మూకర విజయరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి లింగనబోయిన పుల్లారావు, మాజీ ఎంపీటీసీ ఉబ్బన శ్రీనివాసరావు, యాస శ్రీకాంత్ ,కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామస్తులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

2,912 Views

You may also like

Leave a Comment