
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఆగస్టు 19
సిద్దవటం మండలంలోని కడపయపల్లి గ్రామం పరిధిలో రైతుల భూముల రీసర్వే ప్రక్రియలో భాగంగా టక్కోలు గ్రామ సచివాలయం వద్ద ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఆకుల తిరుమల బాబు, ఆర్ఐ నరసింహ ప్రసాద్, డిప్యూటీ సర్వేయర్ సోమశేఖర్, వీఆర్ఓ రజని, విలేజ్ సర్వేయర్ కారుణ్య గార్లు పాల్గొని రైతులకు రీసర్వే విధానం, భూముల సరిహద్దులు, రికార్డుల సరిదిద్దుపై పూర్తి వివరాలు అందించారు.
ఈ సందర్భంగా గ్రామ నౌకర్లు కూడా సహకరించగా, రైతుల నుండి సూచనలు, ప్రశ్నలు స్వీకరించారు.
సమావేశంలో మాజీ ఎంపీటీసీ, పార్లమెంట్ కార్యదర్శి నాగ ముని రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు ప్రత్యేకంగా హాజరై రీసర్వే పనులకు తమ మద్దతు తెలిపారు.