

దేవిపట్నం ప్రెస్ నోట్:VRM Media దుర్గా ప్రసాద్
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం పి గొందూరు గ్రామంలో గోదావరి ఒడ్డున వెలసిన స్వయంభు మాతృశ్రీ గండిపోచమ్మ పుణ్యక్షేత్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల నీరు ఎక్కువ అవ్వడంతో గండిపోచమ్మ ఆలయం నీటమునిగిపోవడంతో గండిపోచమ్మ ఆలయానికి దగ్గరలో ఉన్న అంగులూరు గ్రామ సమీపాన గల రామదాసు కొండపై బాల విగ్రహం తెచ్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది.మాతృశ్రీ గండిపోచమ్మ పి గొందూరు గ్రామానికి సంబంధించిన సోదే వారి ఆడపడుచుగా, మా అందరి ఇలవేల్పుగా కొలుస్తాము అటువంటి మా తల్లి ఆలయం మా గ్రామస్థులకు తెలియకుండా కొందరి స్వలాభం కోసం రామదాసు కొండపై మాతృశ్రీ గండిపోచమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నిజానికైతే అక్కడ విగ్రహాన్ని ప్రతిష్టించడం మాగ్రమస్తులకు అస్సలు ఇష్టంలేదు.ఈ విషయాన్ని ఆ ఆలయ ఎక్సీక్యూటీవ్ అధికారికి అడగగా నాకైతే సంబంధంలేదు గ్రామస్తులే ప్రతిష్ఠించారు అని చెబుతున్నారు. ఆ ఆలయానికి సంబంధించి ఆ అధికారికి ఏమి తెలియకుండా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారా అని మా గ్రామంలో కొందరు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఆ ఆలయంలో రెండవ పూజారిని అడిగితే అది తాత్కాలికం మాత్రమే శాశ్వతం కాదు అని చెబుతున్నారు.ఆవిధంగా అయితే ఆకొండపై కొంత స్థలంలో చేయాలి కానీ ఒక ఎకరం భూమిని శుభ్రంచేసి పెద్ద హైడ్రామా అయితే చేస్తున్నారని గొందూరు గ్రామ ప్రజలు తెలిపారు. మా ఇలవేల్పు అయిన మాతృశ్రీ గండి పోచమ్మ ఆలయ విషయంలో అక్రమంగా మీ సొంత లాభం కోసం ఎక్కడపడితే అక్కడ నిర్మిస్తే ఉపేక్షించేది లేదు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని మా గ్రామస్తులు అందరూ కలిసి ఎండోమెంట్ అధికారులకు అయితే పిర్యాదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ అధికారి వచ్చినప్పటినుండి మాకు సంబంధించిన మాతృశ్రీ గండిపోచమ్మ ఆలయం ఏవిధమైన అభివృద్ధి చేయలేదు. ఏమైనా అభివృద్ధి చేశారంటే దానికి సంబంధించిన బిల్లులు ఉంటే చూపిస్తే అది జరిగిందా లేదా అనేది మాకు కచ్చితంగా తెలుస్తుంది.కాబట్టి ఎండోమెంట్ అధికారులు స్పందించి ఈ ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారిపై మరియు రెండవ పూజారి సోదే వెంకన్న దొర వ్యవహరిస్తున్న తీరుపై చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు అధికారి వారికి వినతిపత్రం అందజేయడం జరిగిందని ఆ గ్రామస్తులు తాతీ రాజేష్, మడకం పోసన్న దొర, కొమరం వీరమణి,రవికుమార్, కొమరం శ్రీనివాస్,ధర్మరాజు, సింగరాజు, తెలియజేశారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird