
కడప జిల్లాVRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ పి ఈశ్వర్ ఆగస్టు 29
కడప/వేంపల్లి వినాయక చతుర్థిని పురస్క రించుకుని స్థానిక వేంపల్లి పట్టణంలో 10 అడుగుల ఎత్తు వినాయక స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా గురువారం జనసేన పార్టీ పులివెం దుల నియోజకవర్గ సీనియర్ నేత, ఛలో పీఠాపురం సమన్వయ కర్త డా దాసరి రవిశంకర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా భక్తులకు ఉదయం తీర్థ ప్రసాదా లను అందజేశారు, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలు జరుపుకునే పెద్ద పండుగలలో ఈ గణేష్ ఉత్సవాలు ప్రత్యేకమని పూజా కార్యక్రమాల్లో ఎక్కువ శాతం మహి ళలు, ఊరేగింపు లో యువత పాల్గొనడం విశేషమ న్నారు.యువత భక్తి శ్రద్ధలతో పూజించి, ఊరేగింపు లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు