

సిద్ధవటంVRM న్యూస్ ఆగస్టు 01
సిద్ధవటం మండలం, టక్కోలు గ్రామం:
టక్కోలు గ్రామ పంచాయతీలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో “సూపరిపాలన తొలి అడుగు” డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం ప్రజల విశేష ఆదరణతో విజయవంతంగా నిర్వహించబడింది. కూటమి ప్రభుత్వ పర్యవేక్షణలో సాగిన ఈ ప్రచారంలో కార్యకర్తలు ప్రతి ఇంటిని సందర్శించి, గత సంవత్సరం కాలంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల జీవనోన్నతిని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రణాళికల గురించి వివరించడమేగాక, ఆగష్టు 15 నుండి మహిళల కోసం ప్రారంభించబోయే ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కూడా విశదీకరించారు.
ఈ కార్యక్రమం ద్వారా స్థానికుల ప్రాథమిక సమస్యలు, అవసరాలను గుర్తించి నమోదు చేయడం జరిగింది.
కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ కార్యదర్శి శ్రీ నాగముని రెడ్డి, శంకర్, శ్రీను, సుబ్బారాయుడు తదితర నాయకులు పాల్గొని, పార్టీ విధానాలను ప్రజలకు వివరిస్తూ ఉత్సాహం కలిగించారు.