
అన్నమయ్య జిల్లా నందలూరు రిపోర్టర్ ధావన్
హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, జాతీయ అధ్యక్షులు తాళ్లూరు ప్రసన్నకుమార్, ఆదేశాలు మేరకు డాక్టర్ డేవిడ్ కళ్యాణ్ రాజు, అధ్యక్షతన సభ్యుల సమావేశం జరిగినది. ఈ సమావేశంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాయలసీమ విజిలెన్స్ వైస్ చైర్మన్, ఎస్. కిరణ్ కుమార్,రాయలసీమ వైస్ చైర్మన్ కె. రామ్మోహన్ రెడ్డి, కడప జిల్లా వైస్ చైర్మన్, ఎన్.అమర్నాథ్ రెడ్డి ని శాలువాలతో సత్కరించి వారికి బాధ్యతలు అప్పగించడం జరిగినది.
డేవిడ్ కళ్యాణ్ రాజు మాట్లాడుతూ ఎక్కడ హక్కులు భంగం కలిగితే అక్కడ మనం ఉండాలి అని హక్కుల పరిరక్షణకు ప్రజలతో మమేకం అవ్వాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ అండ్ తెలంగాణ చైర్మన్, కృష్ణారెడ్డి, కడప వర్కింగ్ కమిటీ చైర్మన్, చెన్నయ్య, రాయలసీమ వర్కింగ్ కమిటీ చైర్మన్ నేసే జాన్ పాల్, పులివెందుల వైద్య విభాగసెల్ చైర్మన్, కల్లూరు పావని, కడప మహిళా సెల్ చైర్మన్, రాణి, ఎర్రగుంట్ల మండల చైర్మన్, విశ్వనాధ్, తదితరులు పాల్గొన్నారు.