ఒంటిమిట్ట మండల జడ్పీటీసీ ఉపఎన్నికల నేపథ్యంలో, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రాజు గారి నెతృత్వంలో కొత్తపల్లి గ్రామంలో టీడీపీ విస్తృత ప్రచార కార్యక్రమం నిర్వహించింది. జగన్ మోహన్ రాజు గారి ఆదేశాల మేరకు, సిద్దవటం మండలానికి చెందిన టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం గత ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు. అలాగే రాబోయే కాలంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి, శివ, శంకర, కరెంటు రమణ తదితర నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు చురుకుగా పాల్గొన్నారు.