నేడు ఒంటిమిట్టలో జరుగుతున్న జెడ్పిటిసి ఉపఎన్నికలలో ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి క్రిష్ణ పిలుపునిచ్చారు. ప్రభుత్వం, ఎన్నికల అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు సజావుగా జరిగేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిందన్నారు ఎక్కడ ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్న వెంటనే పోలీసులకు, ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలని అన్నారు ఉదయం నుండి ఎన్నికల తీరును పలు పోలింగ్ బూతుల వద్దకు తిరుగుతూ పర్యవేక్షిస్తున్నారు.