VRM MEDIA ఖమ్మం ప్రతినిధి
ఆగస్టు 24 : చిన్ననాటి సంగతులు.. విద్యార్థి జీవితాన్ని అవలోకనం చేసు కుంటూ.. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆత్మీయంగా గడిపారు ఆ యువకులు. సారధినగర్ ఆదర్శ విద్యా నిలయం హైస్కూల్ 1994-95 10వ తరగతి విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఒకరిఒకరు పలక రించుకోని జ్ఞాపకాలను పంచుకున్నారు. ఎఫ్సీఐ బైపాస్రోడ్ లో ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. చదువుచె ప్పిన నాటి గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్లెడ్డి ఆఫీస్ ఇన్ చార్జ్ తుంబురు దయాకర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ ఈ సందర్భంగా విద్యార్థి జీవితం ఎంతో ఆనందకరమన్నారు. ఈ కార్యక్రమంలో సాంబశివరెడ్డి, అశోక్ రేడ్డి, సత్యం, కళ్లెం జాన్రెడ్డి, సంజయ్, రామకృష్ణ, వినోద్, రవీందర్, సతీష్ మరియు గురువులు పాల్గొన్నారు.
