Vrm media
PGRS / జనవాణి ప్రజా సమస్యల పరిష్కార వేదిక
--- జనవాణి కార్యక్రమానికి వెల్లువెత్తిన ప్రజానీకం
--- పలు సమస్యలను వినతుల రూపంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారికి అందజేసిన ప్రజలు
--- నిరాధారమైన రెండు కుటుంబాలను దత్తత తీసుకున్న ఎమ్మెల్యే బత్తుల
--- ప్రజా సేవే ముఖ్యంగా ప్రజలతో మమేకమై రోడ్, డ్రైనేజిలు, విద్యుత్తు, త్రాగునీరు సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే బత్తుల
--- సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వం
👉 కోరుకొండ మండలం గరగలంపాలెం గ్రామంలో రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు 'మన ఊరు - మన ఎమ్మెల్యే - మన పల్లెబాట" కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించి, ముందుగా గ్రామ దేవతను దర్శించి అందరూ సుభిక్షంగా ఉండాలని తల్లిని వేడుకున్నారు. అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలతో మరియు జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారితో కలిసి ప్రతీ ఇంటికీ వెళ్లి ప్రజల బాగోగులు అడిగి తెలుసుకుని వారికి ఏదైనా సమస్య ఉంటె వాటి గురించి తెలుసుకుని, వెంటనే సంబంధింత అధికారులతో మాట్లాడారు. ఈ తరుణంలో ఎలాంటి ఆధారం లేనటువంటి రెండు కుటుంబాలను నుండి ఎమ్మెల్యే బత్తుల దత్తత తీసుకున్నారు. ఈ రోజు బాగోగులన్నీ తాను చూసుకుంటానని హామి ఇచ్చారు. ఆ సమయంలో రెండు కుటుంబాలు భావోద్వేగానికి లోనయి ఎమ్మెల్యే గారికి కృతఙ్ఞతలు తెలియజేసారు.
👉 గ్రామంలో గల అంగన్వాడీ సెంటర్ ను సందర్శించి పిల్లలకు అందిస్తున్న భోజనం పరిశీలించారు. అలాగే గుడ్లు, పాలను పరిశీలించి, కొద్దిసేపు పిల్లలతో గడిపారు.. అనంతరం గ్రామంలో జనవాణి కార్యక్రమంతో పాటు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం మరియు ఉచిత కంటి వైద్య శిబిరాలను సందర్శించి, ఉచిత వైద్య పరీక్షలు చేయించుకుంటున్న వారితో మాట్లాడి, సదుపాయాలపైన ఆరా తీసి, సంబంధిత వైద్యులతో మాట్లాడారు. జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల వద్ద నుండి అందుకున్న అర్జీలను విశితంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird