సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ సెప్టెంబర్ 4
. ఈ కార్యక్రమంలో రాజంపేట ఇంచార్జి శ్రీ జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో సీఎం పార్లమెంట్ కార్యదర్శి నాగ ముని రెడ్డి కలుసుకున్నారు. ఈ సందర్బంగా సిద్దవటం మండలం లోని టక్కోలు, కడపాయపల్లి, లింగంపల్లి గ్రామాల్లో ఉన్న పంట పొలాలు ఏరు ప్రవాహం కారణంగా కోతకు గురవుతున్నాయని, భూములు నష్టపోకుండా ఉండేందుకు మూడు గ్రామాలకు రక్షణ గోడ (Protection Wall) నిర్మాణానికి మంజూరు చేసి, పంట పొలాలను కాపాడాలని ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి , ధారపనేని రాజా నాయుడు పాల్గొన్నారు.