


సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ సెప్టెంబర్ 10
నిర్వహించడం జరిగింది..ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు బద్వేల్ వి.వెంకటసుబ్బయ్య గారు పాల్గొని రైతులకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మండలంలో ప్రధానంగా వరి ఎక్కువగా సాగు చేస్తున్నారు కాబట్టి నత్రజని ఎరువులు విచ్చలవిడిగా వాడరాదు. ఒక ఎకరానికి 90 కేజీల నత్రజని పంట కాలానికి సరిపోతాదని రైతులకు తెలియజేశారు . నత్రజని ఎక్కువ మోతాదులో వాడడం వలన వరి పొలంలో గాని ఏ పంటలకైనా చీడపీడలు ఎక్కువగా ఆశిస్తాయని దాని వలన ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని రైతులకు తెలియజేసినారు. పోన్నవోలు మరియు జ్యోతి రైతు సేవ కేంద్రం పరిధిలో ఉండే వరి పంట పొలాలను పరిశీలించడం జరిగింది అక్కడ ప్రధానంగా దోమపోటును మరియు పాము పొడతేగులను అదేవిధంగా ఆకునల్లి కూడా గమనించడం జరిగింది. పాము పొడ తెగులు నివారణకి వాలీడామైసిన్ అనే మందును లీటరు నీటికి 2ml చొప్పున లేదా హెక్సకోనజోల్ అనే మందును ఒక లీటర్ నీటికి 2ml చొప్పున పిచికారి చేసుకోవలెను. దోమపోటు నివారణకు భుప్రో ఫిజియన్ అనగా అప్లోడ్ అనే మందును ఒక లీటర్ నీటికి 1.6 ml లేదా డైనోటెఫ్యూరాన్ అనే మందును ఒక లీటర్ నీటికి 0.4 గ్రామస్ మందును పిచికారీ చేయవలెను. అదేవిధంగా కంకినల్లికి ప్రొఫెనోపాస్ అనే మందును లీటర్ నీటికి 2 ml లేదా ఓ మైట్ అనే మందును ఒక లీటర్ నీటికి 1 ml చొప్పున పిచికారి చేయవలెనని రైతులకు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కే రమేష్ రెడ్డి మరియు వ్యవసాయ విస్తరణాధికారి వై ప్రభాకర్ రెడ్డి మరియు రైతు సేవ కేంద్ర సిబ్బంది హసీనా మరియు రైతులు పాల్గొనడం జరిగింది
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird