

రాష్ట్రస్థాయి కార్పొరేషన్ డైరెక్టర్ ను ఘనంగా సన్మానించిన దూదేకుల జిల్లా సంఘం పెద్దలు
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ సెప్టెంబర్ 12
సిద్దవటం మండలం మాధవరం1 గ్రామ పంచాయతీ
159/83 ది కడప జిల్లా నూర్ బాష అసోసియేషన్ సభ్యులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ భాషా దూదేకుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్గా ఎన్నికైనందుకు డాక్టర్ నాగూరు వీరభద్రుడు ఈరోజు వారి స్వగృహంలో శాలువా కప్పి మహారాజా టోపీ పెట్టి పూలమాలతో ఘనంగా సన్మానించారు. మిఠాయిలు పంచుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా దూదేకుల సంఘం సభ్యులు మాట్లాడుతూ సౌమ్యుడు కష్టపడే తత్వం కలవాడు పార్టీని అంకితభావంతో పనిచేసే పార్టీ వీర విధేయుడు స్టేట్ డైరెక్టర్ గా ఎన్నిక కావడం హర్షించదగ్గ విషయమని వారు డాక్టర్ వీరభద్రుడు కొనియాడారు. సంఘం డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ప్రకటించిన నిధులను సద్వినియోగం చేసి దూదేకుల సామాజిక వర్గం సంఘంలో ఉన్నత స్థానంలోకి తీసుకుపోయే విధంగా కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా డాక్టర్ వీరభద్రుడు మాట్లాడుతూ నాకు ఇంత గొప్ప పదవిని అందించిన గౌరవనీయులు ముఖ్యమంత్రి నియోజకవర్గ ఇన్చార్జి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ తనను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన దూదేకుల జిల్లా నియోజకవర్గ సంఘాల వారికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి 159/83 ది కడప జిల్లా నూర్ బాష అసోసియేషన్ గౌరవ సలహాదారులు ఆయిల్ మిల్ ఓబులేసు, కడప జిల్లా అధ్యక్షులు కాదరయ్య, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఎన్ ఇమాములు, ప్రధాన కార్యదర్శి మస్తాన్ సార్, రిటైర్డ్ ప్రిన్సిపల్ కోశాధికారి అజ్మతుల్లా, ఉపాధ్యక్షులు మస్తాన్, కోనరాజుపల్లి మాజీ సర్పంచ్ బాషా, కడప బుజ్జయ్య, లోకల్ దూదేకుల నాయకులు సిలర్ సాబ్,రసూల్ సాబ్,లాల్ పీర్, పేట మస్తాన్, అయ్యన్న సాబ్, బషీర్, చౌడయ్య,
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird