

కడప అర్బన్ VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ సెప్టెంబర్ 13:
కడప జిల్లా అర్బన్ కేంద్ర మంత్రి రామ్ దాసు అత్వాలే అక్టోబర్ 4,5,6 తేదీల్లో ఏపిలో పర్యటించ నున్నారని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అత్వాలే ) జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ అన్నారు శనివారం కడప ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శివ సాయి రెసిడెన్షియల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.తమ పార్టీ ఎన్డీయే కూటమి భాగస్వామిగా ప్రధాని నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో మూడవ సారి కొనసాగుతున్నారని చెప్పారు.ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ముందుగా తిరుపతి, తిరుమల దేవస్థానాన్ని సందర్శించ నున్నారని అక్కడ ఆయనకు ఘనంగా సన్మానం జరుగుతుందని చెప్పారు.భారత దేశం లో ప్రతి లక్ష మందిలో 5 వేల మందికి వినికిడి శక్తి తగ్గి చెవిటి వారు అవుతు న్నారని చెప్పారు.ఇందులో బాగం గా ఏపి సిఎం చంద్రబాబు ఆద్వ ర్యంలో మంగళగిరి లోని సికే ఫంక్షన్ హాలులో మంత్రి అత్వాలే చేతులు మీదుగా వినికిడి యంత్రాలు పంపి ణీ చేయడం జరుగుతుందని తెలి పారు.కావున పార్టీ నాయ కులు, కార్యకర్తలు పాల్గొని పర్యటనను జయప్రదం చేయాలని కోరారు.ఈ సమావేశంలో ఆ పార్టీ సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ ఎన్ డి అజయ్ ప్రసన్న, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird