



గణేశ్ విగ్రహాల నిమజ్జనం పురస్కారించుకొని ఖమ్మం నగరంలోని కాల్వవోడ్ధు మున్నేరు వద్ద జరిగే నిమజ్జనం ప్రాంతాన్ని నగరపాలక కమిషనర్ అభిషేక్ అగస్త్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజా, నగర మేయర్ నిరజా, సంభాధ్రి ఉత్సవ కమిటీ వారితో కలసి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరిశీలించారు. శోభాయాత్ర, నిమజ్జన సమయాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రహదారిపై అడ్డుగా వైర్లు, చెట్టు కొమ్మలు లేకుండా చొరవ తీసుకోవాలని సూచించారు. మున్నేరు వరద ఉదృతి దృష్టిలో పెట్టుకొని నిమజ్జనం అనంతరం తిరుగు ప్రయాణంలో ప్రత్య్నమయ మార్గాలలో వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా క్రేన్లు, ఫ్లడ్ లైట్లు, మార్గాలు, బారికేడింగ్ తదితర అంశాలపై చర్చించారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు వుండాలని, సీసీ కెమెరాలను కంట్రోల్రూమ్కు అనుసంధానం అయ్యేలా చూసుకొవాలని సూచించారు. మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, పోలీసులతో పాటు అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా శోభాయాత్ర, నిమజ్జనం జరిగే విధంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో సహకరించుకోవాని సూచించారు.
కార్యక్రమంలో ఏసీపీ రమణమూర్తి ఇన్స్పెక్టర్ మోహన్ బాబు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, మున్సిపల్ EE కృష్ణలాల్, AMC అనిల్, DEE శ్రీనివాస్ రావు, సంభాధ్రి ఉత్సవ కమిటీ విద్యాసాగర్, వినోద్ లహౌటి, తదితరులు పాల్గొన్నారు. పి ఆర్ వో
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird