
కోదండ రామయ్య వరం పంచాయతీ కార్యదర్శి సుధాకర్ ఒంటిమిట్ట రావడం
VRM న్యూస్ అన్నమయ్య జిల్లా ఇంచా ర్జ్ రవిబాబు సెప్టెంబర్ 11
ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఏకశిలా నగరం ఒంటిమిట్ట మేజర్ పంచాయతీ కి కార్యదర్శిగా వచ్చినప్పటి నుంచి సుధాకర్ నిద్రాహారాలు మా నీ మానవసేవే మాధవసేవ అంటూ ఒంటిమిట్ట ప్రతి అంగుళం తనిఖీ చేసి ఎటువంటి అపరి శుభ్రత లేకుండా ఎప్పటికప్పుడు గ్రీన్ అంబాసిడర్ లద్వారా పరిశుభ్రం చేయిస్తూ ఒంటిమిట్ట మండలంలోని ప్రజలకు ఎటువంటి అంటూ వ్యాధులు సోకకుండా ఎప్పటికప్పుడు గమ్మిసేన్ పౌడర్ వీధివీధిలోను చల్లిస్తూ ఎప్పటికప్పుడు ప్రజల ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తూ ఒంటిమిట్ట మండల ప్రజల మన్ననలు పొందుతున్నాడు. అంతేకాకుండా నరవకాటి పల్లి దగ్గర డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేసి. ఒంటిమిట్టలోని ప్రతి వీధికి ట్రాక్టర్ను పంపుతూ చెత్త మొత్తాన్ని డంపింగ్ యార్డ్ కి చేర్చి దానిని ఎరువులుగా తయారు చేస్తున్నారు. ఇటువంటి కార్యదర్శి ఒంటిమిట్ట మండలానికి రావడం ఒంటిమిట్ట ప్రజల అదృష్టమని భావిస్తున్నారు. ఎంతోమంది కార్యదర్శులు పనిచేసే వెళ్లారు ఒకరు కూడా రామాలయం దగ్గర సాయిబాబా గుడి దగ్గర బస్టాండ్ దగ్గర స్క్రోలింగ్ లైట్లు అమర్చిన పాపన పోలేదు సుధాకర్ స్క్రోలింగ్ లైట్లు అమర్చి తెలియని వారికి కూడా తడి చెత్త పొడి చెత్త గురించి వివరంగా పొందుపరిచారు.