

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ సెప్టెంబర్ 22
దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు వివిధ పుష్పాల అలంకారాలతో దుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు సిద్ధవటం మండలంలోని ఉప్పరపల్లి గ్రామం సాయి నగర్ లోని శ్రీ బద్రావతి బావ నారాయణస్వామి మరియు సీతారాముల గుడి ప్రాంగణంలో దసరా శరన్న నవరాత్రుల ఏడవ వార్షికోత్సవం సందర్భంగా దుర్గమ్మ అమ్మవారికి పి ఆర్ బి హ్యాండ్లూమ్ అధినేత పుత్త రామచంద్రయ్య కుమారులు పుత్త బాబు, నాగభూషణం ఆధ్వర్యంలో తొలి రోజు దుర్గమ్మ అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చింది ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమర్నాథ్ శర్మ మాట్లాడుతూ దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారు ప్రతిరోజు ఒక అలంకరణతో 11 రోజులు భక్తులకు దర్శనమిస్తుందని దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసినవారికి కుటుంబ, వ్యాపార ఉద్యోగ సమస్యలు తొలగిపోతాయని తెలిపారు ఈ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird