సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ సెప్టెంబర్ 30
రేపు సిద్దవటం మండలంలోని టక్కోలు గ్రామంలో రేషన్ డీలర్షిప్ ప్రారంభోత్సవం, రైస్ కార్డుల పంపిణీ, అలాగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి రాజంపేట ఇంచార్జి శ్రీ జగన్ మోహన్ రాజు గారు హాజరుకానున్నారు. కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నట్లు పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి గారు, సర్పంచ్ లక్ష్మి దేవి గారు తెలిపారు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని నాగముని రెడ్డి గారు కోరుతున్నారు.