Home వార్తలుఖమ్మం విజయదశమి సందర్భంగా దమ్మపేటలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

విజయదశమి సందర్భంగా దమ్మపేటలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

by VRM Media
0 comments

VRM మీడియా న్యూస్
రిపోర్టర్:- లక్ష్మయ్య
సత్తుపల్లి
ఖమ్మం జిల్లా
Date 02/10/2025 న

విజయదశమి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు శుక్రవారం ఉదయం దమ్మపేట మండల పరిధిలోని నాచారం, వడ్లగూడెం గ్రామాల్లోని దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నాచారం గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజల భక్తి కేంద్రంగా నిలిచిన శ్రీ జగదాంబ తల్లి అమ్మవారి ఆలయాన్ని, అలాగే లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని దర్శించి పూజలు చేశారు. అనంతరం వడ్లగూడెం గ్రామంలోని పురాతన శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల ఆయా దేవాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై కమిటీ సభ్యులతో సమీక్ష చేపట్టారు. స్థానిక అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం కృషి చేస్తుందని భక్తులకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో దమ్మపేట మండల సీనియర్ నాయకులు పైడి వెంకటేశ్వరరావు, అచ్యుతరావు, దమ్మపేట సొసైటీ చైర్మన్ రాఘవరావు, మురళి, తాళ్లూరి రాఘవరావు, సత్తుపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు చల్లగుళ్ళ నరసింహారావు, విద్యాసంస్థల అధినేత చలసాని సాంబశివరావు, పువ్వాళ్ళ ఉమా తదితరులు పాల్గొన్నారు.

2,834 Views

You may also like

Leave a Comment