

Vrm media ఖమ్మం ప్రతినిధి
నేడు డిల్లీలొ ప్రదానమంత్రి నరేంద్రమోది చేతుల మీదుగా ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఆరెంపులకు చెందిన యువతి తాళ్లూరి పల్లవి అవార్డును అందుకున్నారు.. ఆర్టిపిషియల్ ఇంటలీజెన్స్ ప్రొగ్రామింగ్ అసిస్టెంట్ (AIPA (Artificial intelligence programming assistant) విభాగంలొ ఈ అవార్డును అందుకున్నారు… ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కౌశల్ దీక్షాంత్ సమరోహ్లో ప్రధాని యువతలో స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగ నైపుణ్యాల్ని పెంచేందుకు ప్రధాన మంత్రి సేతు (PM-SETU) పథకాన్ని రూ. 60,000 కోట్లతో ప్రవేశపెట్టారు. దీనిలొ బాగంగానే అత్యుత్తమ నైపుణ్యం కనపరిచిన పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్దులకు అవార్డులను ప్రదానం చేశారు.. దీనిలొ బాగంగానే ఆర్టిపిషియల్ ఇంటలీజెన్స్ విభాగంలొ ఆల్ ఇండియా ట్రేడ్ టాపర్ గా ఎన్నికైన తాళ్లూరి పల్లవికి ప్రదాని చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేశారు… ఈసందర్బంగా పల్లవి తల్లిదండ్రులు తాళ్లూరి రవి, అజిత అనందం వ్యక్తం చేశారు…