
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ అక్టోబర్ 8
జగనన్న కాలనీ గృహ నివాసుల సమస్యలపై రాష్ట్ర దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు కాలనీలో పర్యటించారు మండలంలోని మాధవరం గ్రామం జగనన్న కాలనీ నివాసుల సమస్యలపై రాజంపేట నియోజక వర్గ టిడిపి ఇంచార్జ్ చమ్మర్ది జగన్మోహన్ రాజు సూచన మేరకు మంగళవారం ఆ ప్రాంతంలో రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వీరభద్రుడు పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీ పేరిట గత వైసీపీ ప్రభుత్వంలో ఇల్లు లేని నిరుపేదలకు పక్కా గృహాలు మంజూరు చేశామంటూ హడావిడి చేసిన గత ప్రభుత్వం బినామీ పేర్లతో ధనవంతులకు పక్కా గృహాలు కట్టబెట్టి కాలనీలో మూలిక వసతులు సమకూర్చక గృహనివాసులు అవస్థలు పడుతున్నారని కాలనీలో ముళ్ళ పొదలు, విపరీతంగా ఉండడంతో రాత్రి వేళలో విషపురుగులు సంచరిస్తున్న పంచాయతీ సిబ్బంది తొలగింపు చర్యలు చేపట్టగా కాలనీ గృహనివాసులు బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారని రాత్రి వేళలో విద్యుత్ దీపాలు లేక త్రీవ ఇబ్బందులకు గురై తున్నట్లు తెలిపారని కాలనీలో రోడ్డు నిర్మాణం కూడా గత ప్రభుత్వం చేపట్టలేదని కాలనీ వాసులకు సమస్యలు సంబంధిత అధికారులు పరిష్కారం చేయకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి లికిత పూర్వకంగా తీసుకెళ్తా అని తెలిపారు ఈ కార్యక్రమంలో మురళి,
హరి, కాలనీ గృహనివాసులు పాల్గొన్నారు