
ఏలేస్వరం
ఆటో డ్రయివర్లకు సేవలో కార్యక్రమంలో భాగంగా ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో ఆటో యూనియన్ సభ్యులు కూటమి నేతల సమక్షంలో మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు,నాయకులు బస్సా ప్రసాద్ మైరాల కనకరావు చేతులు మీదుగా అటో యూనియన్ సభ్యులు పాలాభిషేకం చేపట్టారు.
ఆటో కార్మికులు కష్టాలను గుర్తించి ప్రతి ఆటో కార్మికుడికి 15000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం పై స్థానిక ఎమ్మెల్యే సత్య ప్రభ కు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ,గంగిరెడ్ల మణికంఠ,తోట వెంకటేశ్వరరావు,ఆకుల నాని,బండారు సూరిబాబు,వాయుపుత్ర ఆటో యూనియన్ సభ్యులు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…