
వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు
వైసీపీ పార్టీలోనే మహిళకు గుర్తింపు సముచిత స్థానం కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైసీపీ కో ఆర్టినేటర్ ముద్రగడ గిరిబాబు అన్నారు. కిర్లంపూడిలో మాజీమంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం నివాసంలో శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన దళిత నాయకులు మహిళలు, వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ను కలిశారు. గిరిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దళితులకు వైసీపీ పార్టీ అండగా ఉంటుందని పార్టీ విజయానికి దళితులంతా కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. దళితులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామన్నారు. గిరిబాబును మహిళలు సాలువ గిరిబాబును మహిళలు శాలువా వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో తోటడ రాజు, తిరగటి సతీష్ బాబు, మడికి ప్రకాష్ రావు, ఎద్దు కామయ్యమ్మ, జెర్రి రాజేష్, వై. చిన్నరాజు తదితరులు పాల్గొన్నారు.