

ఒంటిమిట్ట మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బందిపై మండల రెవెన్యూ అధికారి దామోదర్ రెడ్డి (ఫైర్ )
VRM న్యూస్ బాల మౌలాలి అక్టోబర్ 8
ఆంధ్ర భద్రాద్రి గా పేరుగాంచిన ఏకశిలా నగరం ఒంటిమిట్ట మండల రెవెన్యూ కార్యాలయంలో సిబ్బంది తో మండల రెవెన్యూ కార్యాలయ అధికారి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.మండల ప్రజల సమస్యలపై సీరియస్ గా రెవెన్యూ సిబ్బంది పనిచేయాలని సమయానుకూలంగా ప్రజల సమస్యలపై స్పందించాలని ఆయన రెవెన్యూ సిబ్బందిని కోరారు. అంతేకాకుండా మండల ప్రజలు ఎవరైనా సమస్యలతో వస్తే వారి సమస్యను వెంటనే నా దృష్టికి తీసుకురావాలని మండల పరిషత్ కార్యాలయానికి సమయానికి హాజరుకావాలని సిబ్బంది నీ ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా భూ సమస్యలపై వచ్చిన రైతన్నలకు వారికి ఇచ్చిన గడువు లోపల వారి పనులు చేయాలని రెవెన్యూ సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బంది. మండల పరిషత్ కార్యాలయ అధికారి సుజాతమ్మ పాల్గొన్నారు.